Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గెస్ట్ రోల్ కోసం అంతర్వేది చేరిన బాలకృష్ణ
మంచు మనోజ్ తాజా చిత్రం ఊ కొడతారా ఉలిక్కిపడతారా లో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం బాలకృష్ణ రాజమండ్రి వెళ్ళారు. నరసాపురం దగ్గరలో ఉన్న అంతర్వేదిలో ఈ చిత్రం షూటింగ్ జరగుతోంది. అక్కడ గోదావరి నదీ ప్రాంతాన షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయం లక్ష్మీ ప్రసన్న వివరిస్తూ... అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవస్ధానం వద్ద జరిగే షూటింగ్ లో బాలకృష్ణ నాలుగు రోజులు పాల్గొంటారు. ఆయన పాత్ర సినిమాకు హైలెట్ కానుంది అని చెప్పారామె. ఈ చిత్రం 2012 వేసవిలో రిలీజ్ కానుంది. బేబో శశి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇక సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలకృష్ణ పాత్ర కీలకమై నిలుస్తుందని వినపడుతోంది. మోహన్ బాబుకీ, బాలయ్యకీ ఉన్న అనుబంధంతో ఈ చిత్రంలో చేయటానికి కమిటయ్యాడని చెప్పుకుంటున్నారు. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు రూపొందనుందని చెప్తున్నారు. ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న.. తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది.
ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ.. కృష్ణవంశీ దగ్గర అసోసియేట్గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా' అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.