బాలయ్య నేతృత్వంలో సినీ తారల ర్యాలీ
కేన్సర్ వ్యాధిపై చైతన్యం తెచ్చేందుకు తెలుగు సినీ తారలు నడుబిగించారు. ఈ రోజు కేన్సర్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సినీ నటుడు బాలయ్య నేతృత్వంలో బసవ తారకం కేన్సర్ ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వరకు కేన్సర్ అవేర్ నెస్ వాక్ నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ....కేన్సర్ ను నిర్మూలించాలంటే ముందు ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలని, ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అన్నారు. తొలి దశలోనే దీన్ని గుర్తించడం ద్వారా నయం చేయడం సులభం అన్నారు. ఈ ర్యాలీలో బాలయ్యతో పాటు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపచంద్, నటులు మురళీ మోహన్, రాజశేఖర్, అలీ, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











