twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏకమైన బాలయ్య, బెల్లంకొండ

    By Staff
    |

    Balakrishna
    రాజకీయాల్లోనే కాదు, సినిమా రంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం తాజాగా ధృవపడింది. నిర్మాత బెల్లంకొండ సురేష్ చిత్రం "రైడ్" ఆడియో విడుదల ఉత్సవానికి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బెల్లంకొండ- బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన "చెన్నకేశవరెడ్డి" "లక్ష్మీ నరసింహ" చిత్రాల గురించి జనం మర్చిపోయారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల్లో బెల్లంకొండ సురేష్, జోతిష్యుడు సత్యనారాయణ చౌదరి గాయపడడం ఒక్కటే గుర్తుకు వస్తుంది. దాదాపు ఐదేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది.

    బెల్లంకొండ సురేష్ లివర్ లో బాలకృష్ణ కాల్చిన బుల్లెట్లు ఇంకా ఉన్నాయి. ఆ నొప్పులు అలా ఉండగానే బాలకృష్ణ, బెల్లంకొండ మంచి మిత్రులుగా స్టేజి మీద కన్పించడం ఆశ్చర్యం కలిగించింది. బాలకృష్ణ తనను కాల్చలేదని కోర్టులో చెప్పినందుకు గాను బాలయ్య అతనికి కాల్షీట్లు ఇచ్చినట్టు అప్పట్లో విన్పించింది. అది నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని నిన్నటి సంఘటన నిరూపిస్తోంది. బెల్లంకొండ గట్స్ ఉన్న నిర్మాత అని బాలకృష్ణ ప్రశంసించారు. బాలయ్య బాబు దేవుడితో సమానమని, తాను ఆయనకు వీరాభిమానినని బెల్లంకొండ అన్నారు. బాలకృష్ణ పాట "దంచవే మేనత్త కూతురా" పాటను బెల్లంకొండ తన "రైడ్" సినిమాలో రీమిక్స్ చేశారు. "కాలం మారుతుంది-చేసిన గాయాలు మాన్పుతుంది" అన్న సినిమా పాట గుర్తుకొస్తోందా ఈ ఇద్దరు మిత్రుల బంధాన్ని చూస్తుంటే....

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X