Don't Miss!
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగ్, బాలయ్య ఇద్దరూ వెరీగుడ్
హైదరాబాద్ :ఈ రోజు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు అక్కినేని నాగార్జున, అమల దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
My dear friends in Hyderabad please do vote for #GHMCElections/ I DID!!! pic.twitter.com/MkLhTnCfcy
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 2, 2016
నాగార్జున మీడియాతోమాట్లాడుతూ..ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారా మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని సూచించారు.
అఖిల్కు ఓటు లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరంలో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద నాగార్జునతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు.
మరో ప్రక్క జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలబ్రెటీలు ఒక్కొక్కరే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని, వాటిని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా పోస్ట్ చేసి తమ అభిమానులకు ప్రేరణగా నిలుస్తున్నారు.