Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చంద్రబాబుకు బాలకృష్ణ హామీ
స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి మే 28. ఆ వేడుకలను నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్రామ్, తారకరత్నలు తో కలిపి నిఘనంగా జరుపటానికి రెడీ అవుతున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఈ హీరోలంతా టిడిపి ప్రధాన కార్యాలయానికి రానున్నారు. అక్కడ నందమూరి అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుతారు. ఈ మేరకు తన వియ్యంకుడు చంద్రబాబుకు బాలకృష్ణ హామీ ఇచ్చారు.
అలాగే ఎన్టీఆర్ జయంతిని టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ జరుపుతాయి. నిజానికి ఆ సమయానికి టిడిపి మహానాడును జరుపాల్సి వుంది. ఉప ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. చంద్రబాబునాయుడు 'మీ కోసం' రథం ఆ సమయానికి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఉంటుంది. అందుకని ఆయన, పార్టీ సీనియర్లు, హరికృష్ణ జగ్గయ్యపేటలోనే ఎన్టీఆర్ జయంతిని జరుపుతారు. ఈ కార్యక్రమం నిమిత్తం మే 28న ఎన్టీఆర్ భవన్కు అభిమానులు వేలాదిగా తరలివచ్చే అవకాశముంది.