twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబుకు బాలకృష్ణ హామీ

    By Staff
    |

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి మే 28. ఆ వేడుకలను నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, తారకరత్నలు తో కలిపి నిఘనంగా జరుపటానికి రెడీ అవుతున్నారు. ఆ రోజు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన ఈ హీరోలంతా టిడిపి ప్రధాన కార్యాలయానికి రానున్నారు. అక్కడ నందమూరి అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుతారు. ఈ మేరకు తన వియ్యంకుడు చంద్రబాబుకు బాలకృష్ణ హామీ ఇచ్చారు.

    అలాగే ఎన్టీఆర్ జయంతిని టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ జరుపుతాయి. నిజానికి ఆ సమయానికి టిడిపి మహానాడును జరుపాల్సి వుంది. ఉప ఎన్నికల కారణంగా అది వాయిదా పడింది. చంద్రబాబునాయుడు 'మీ కోసం' రథం ఆ సమయానికి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఉంటుంది. అందుకని ఆయన, పార్టీ సీనియర్లు, హరికృష్ణ జగ్గయ్యపేటలోనే ఎన్టీఆర్ జయంతిని జరుపుతారు. ఈ కార్యక్రమం నిమిత్తం మే 28న ఎన్టీఆర్ భవన్‌కు అభిమానులు వేలాదిగా తరలివచ్చే అవకాశముంది.


     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X