Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ పేరు వింటే రక్తం పొంగుతుంది.. ఎప్పుడుంటే అప్పుడు సై... బాలయ్య
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ అన్నారు. నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి రోజున టాలీవుడ్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ భావోద్వేగంగా ప్రసంగించారు. మహానటుడు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ..
తెలుగు వారి ఆత్మగౌరవం ప్రశ్నార్తకంగా
ఎందరో తెలుగు మహనీయుల త్యాగాలు, కృషి నిర్వీర్యమై పోయి తెలుగు వారి ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు వారని కాకుండా మద్రాసీలుగా పిలువబడుతున్న సమయంలో నందమూరి తారక రామారావు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. తనకు ఎంతో గొప్ప జీవితాన్ని అందించిన ప్రజలకు ఏదైనా చేయాలనే బలమైన కోరికతో ముందుకు కదలాడు. ఆ తర్వాత ఆ నిర్ణయం చరిత్ర లిఖించేందుకు దారి తీసింది అని బాలకృష్ణ ఉద్వేగంగా అన్నారు.
పాత్రలను ఆకళింపు చేసుకొని
నటన అంటే కేవలం పాత్రలను పోషించడం కాకుండా.. వాటిని ఆకళింపు చేసుకొని ప్రతీ పాత్రలో జీవించేవారు. NTR అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు. ఎన్ అంటే ఆయన ఒక నటనాలయం. టీ అంటే తారా మండలంలో తారకుడు. ఆర్ అంటే రాజర్షి, రాజకీయ ధురంధుడు అంటూ బాలకృష్ణ నిర్వచనం చెప్పారు.
మూడు అక్షరాలు వింటే
తెలుగు అనే మూడు పదాలను వింటే తనువు పులకిస్తుంది. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు వింటే రక్తం పొంగుతుంది అని బాలకృష్ణ ఉద్వేగంగా ప్రసంగించారు. ఎన్టీఆర్ను అనుకరించే వాళ్లు వారసులు కాదు. అనుసరించే వాళ్లే నిజమైన వారసులు. కార్యకర్తలు, వారసులే నిజమైన వారసులు అని అన్నారు. ఎప్పుడు అవసరమైనా నేను ప్రత్యక్షం అవుతానని పేర్కొన్నారు.
దేశానికి గొప్ప పేరు తెచ్చిన ఎన్టీఆర్
పుట్టిన కుటుంబానికి, ఊరుకు, దేశానికి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వారికి ఆయనే నిజమైన మహానుభావుడు. ప్రపంచ పటంపై తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన నటుడు, రాజకీయ నేత ఆయన. ఎన్టీఆర్ నాకు తండ్రే కాదు.. దైవం. సమాజంలో ఎన్నో అసమానతలు రూపు మారిన వ్యక్తి జీవితం స్ఫూర్తిదాయకం. ఏప్పుడైనా మనసు బాగా లేకపోతే ఆయన పేరు తలుచుకొంటే శరీరంలో ఉత్తేజం కలుగుతుంది అని బాలకృష్ణ ఆన్లైన్లో ప్రసంగించారు.