థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ వీరంగం, స్క్రీన్ చించివేత!

By Bojja Kumar

అనంతపూర్: అభిమానులకు కోపం వస్తే ఎలా ఉంటుందో...వారి తడాఖా ఏ రేంజిలో ఉంటుందో మరోసారి రుజువైంది. నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లో అభిమానులు వీరంగం సృష్టించారు. కుర్చీలు విరగొట్టారు. స్క్రీన్ చించివేసారు. అనంతపూర్‌లోని గురునాథ్ థియేటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

సినిమా ప్రదర్శితం అవుతున్న సమయంలో సౌండ్ సిస్టం సరిగా పని చేయలేదు. దీంతో అభిమానులు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవ్వడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు థియేటర్లోని కుర్చీలు, స్క్రీన్‌పై తన ప్రతాపం చూపించారు. ఈ ఘటనపై మేనేజ్మెంట్ లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

Balakrishna fans tear the screen off

లెజెండ్ సినిమా విషయానికొస్తే...మార్చిన 28న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతోంది. 'సింహా' లాంటి హిట్ చిత్రం తర్వాత బాలయ్యపై భారీగా అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగిన విధంగానే బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. తొలి రోజు ఈ చిత్రం రూ. 7 కోట్లకు పైగా వసూలే చేసింది. బాలయ్య కెరీర్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించబోయే చిత్రంగా నిలవబోతోందని, 50 కోట్ల మార్కను త్వరలోనే అందుకుంటుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విజయోత్సవ యాత్ర నిర్వహిస్తూ బిజీబిజీగా గుడుపుతున్నారు. ఈ రోజు సింహాచలం గుడి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ మీదుగా విజయోత్సవ యాత్ర సాగింది. ఏప్రిల్ 2న ఉదయం 5.30 గంటలకు కనకదుర్గ గుడి, 7 గంటలకు మంగళగిరి గుడి, 8 గంటలకు పెద కాకాని గుడి, 11.30 గంటలకు ఒంగోలు థియోటర్, మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు థియోటర్, రాత్రి 7 గంటలకు తిరుపతి థియోటర్లను లెజెండ్ టీం సందర్శించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X