Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంచి పని కోసం బాలయ్య- యువరాజ్ సింగ్ ఒక్కటై.. (ఫోటో)
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ, క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ మంచి పని చేయడం కోసం ఒక్కటయ్యారు. ఈ మేరకు ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్లో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా బాలకృష్ణ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్ బారిన పడి ఆ వ్యాధిని జయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక్కటయ్యారు. అవకగాహన కల్పించడంతో పాటు, క్యాన్సర్ బాధితులకు చికిత్సలు చేయించేందుకు నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
యువరాజ్ సింగ్ యువీకెన్ (YOUWECAN) అనే ఆర్గనైజేషన్ ద్వారా కాన్సర్ బాధితులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. క్యాన్సర్ బాధితులను ఆదుకోవడానికి యువరాజ్సింగ్ ఏర్పాటుచేసిన 'యూవీకెన్' సంస్థ, బాలయ్య చైర్మన్ గా కొనసాగుతున్న బసవతారకం ఆసుపత్రి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం ఉధృతం చేయనున్నాయి.