Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రెచ్చగొడితే తరిమి కొడతారు కబడ్దార్: బాలకృష్ణ!
సినీ పరిశ్రమలో ఐక్యమత్యం లేదని అందరూ గోడమీద పిల్లుల్లా ఉన్నారని సినీ నటుడు మోహన్ బాబు ద్వజమెత్తారు. తన పిల్లలపై, సినిమా యూనిట్ పై దాడి జరిగితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించదేం. అని ప్రశ్నించారు. పరిశ్రమలో ఎవరు ఎటు వైపు ఉన్నారో స్పష్టంగా చెప్పాలన్నారు. ఇంత జరిగినా తమను ఎవరూ పరామర్శించడానికి రాలేదన్న తర్వాత బాలకృష్ణ ఆవేశంతో ఇలా మొదలెట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని హైద్రబాద్ లో షూటింగ్స్ చేసుకోలేని పరిస్థితి దాపురించడం శోచనీయం. ఇంత పరిస్థితికి పూనుకున్న అరాచక శక్తులను అదుపు చేయలేని గర్నమెంట్ ఇక్కడ ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. కళాకారులకూ, సినీ పరిశ్రమకూ రక్షణ కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంకు ఉంది. ఇలాంటి సమయంలో కూడా నిర్లక్ష్యం వహించే ప్రభుత్వం పై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుంది.
ఇలా అరాచకాలు జరిగితే ఎవరికి వాళ్లు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దాడులకు ప్రతి దాడులు చేసుకోవాల్సి ఉంటుంది. మా నాన్న గారు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలనే 'తెలుగుదేశం" పార్టీని స్థాపించారు. అలాంటి నాయకులంతా కీర్తి శేషులవ్వడంతో ఇవ్వాళ అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. రెచ్చగొడితే కనుక తరిమి కొడతారు. జాగ్రత్త అరాచక శక్తుల్లారా అంటూ హెచ్చరిస్తున్నాడు బాలకృష్ణ.