Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గోపీచంద్ ఫ్లాపు సినిమా అంతలా నచ్చేసిందా బాలకృష్ణా?
బాలయ్య బాబు 'ఆంధ్రుడు సినిమా చూసి...ఆ సినిమాకి పనిచేసిన టీమ్నే ఈ సినిమాకూ తీసుకోండి' అంటూ దర్శుకుడు పరుచూరి మురళి ఆనందోత్సాహాల మధ్య చెప్పుకొచ్చారు. గోపీచంద్ హీరోగా చేసిన ఆంద్రుడు సినిమా టైటిల్ లో తప్ప మరెక్కడా విషయం లేదని అప్పట్లో అంతా రిజెక్టు చేసారు. ఇదే విషయాన్ని దర్శకుడు కూడా ఒప్పుకుంటూ..ఇది వరకు 'ఆంధ్రుడు' అనే సినిమా తీశా. 'అనవసరంగా ఆ సినిమా తీశా..' అనుకునేవాడ్ని. కానీ ఇప్పడు బాలయ్య మాటలు వింటుంటే ఆనందంగా ఉంది..మా కష్టం వృథా కాలేదు అనిపించింది అన్నారు. ఇంతకీ బాలకృష్ణకు ఈ ఆంద్రుడు చిత్రంలో ఏమి నచ్చిందో అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే పెద్ద హీరోని ఎలా డీల్ చేసాడో బాలయ్య చూసి జడ్జిమెంట్ ని చెప్పారని కొందరంటున్నారు. ఏదైమైనా మంచి కథకుడు పేరు పొందిన పూరీ జగన్ కథని రిజెక్టు చేసిన బాలకృష్ణ ..ఇలా ఆంద్రుడు చిత్రం చూసి ఆ దర్శకుడుకి అవకాశమివ్వటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ఈ షూటింగ్ ను ఆరంభించి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం' అని చెప్తున్నారు నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి. ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.