Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గోపీచంద్ ఫ్లాపు సినిమా అంతలా నచ్చేసిందా బాలకృష్ణా?
బాలయ్య బాబు 'ఆంధ్రుడు సినిమా చూసి...ఆ సినిమాకి పనిచేసిన టీమ్నే ఈ సినిమాకూ తీసుకోండి' అంటూ దర్శుకుడు పరుచూరి మురళి ఆనందోత్సాహాల మధ్య చెప్పుకొచ్చారు. గోపీచంద్ హీరోగా చేసిన ఆంద్రుడు సినిమా టైటిల్ లో తప్ప మరెక్కడా విషయం లేదని అప్పట్లో అంతా రిజెక్టు చేసారు. ఇదే విషయాన్ని దర్శకుడు కూడా ఒప్పుకుంటూ..ఇది వరకు 'ఆంధ్రుడు' అనే సినిమా తీశా. 'అనవసరంగా ఆ సినిమా తీశా..' అనుకునేవాడ్ని. కానీ ఇప్పడు బాలయ్య మాటలు వింటుంటే ఆనందంగా ఉంది..మా కష్టం వృథా కాలేదు అనిపించింది అన్నారు. ఇంతకీ బాలకృష్ణకు ఈ ఆంద్రుడు చిత్రంలో ఏమి నచ్చిందో అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే పెద్ద హీరోని ఎలా డీల్ చేసాడో బాలయ్య చూసి జడ్జిమెంట్ ని చెప్పారని కొందరంటున్నారు. ఏదైమైనా మంచి కథకుడు పేరు పొందిన పూరీ జగన్ కథని రిజెక్టు చేసిన బాలకృష్ణ ..ఇలా ఆంద్రుడు చిత్రం చూసి ఆ దర్శకుడుకి అవకాశమివ్వటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ఈ షూటింగ్ ను ఆరంభించి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం' అని చెప్తున్నారు నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి. ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.