twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ‘మహదేవనాయుడు’ వచ్చే సంవత్సరానికే

    By Srikanya
    |

    బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శక్వంలో కూపొందుతున్న 'మహదేవనాయుడు" చిత్రం సంక్రాంతి పండుగ రోజు అంచే జనవరి 12, 2012 న విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించారు. పాటలు మినహా చిత్రం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాను సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలనేది బాలయ్య అభిమానుల కోరిక అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ఛార్మి, లక్ష్మీ రాయ్, సలోని హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు పరుచూరి మురళి మాత్రం బాలకృష్ణను ఓ కొత్త డైమెన్సన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

    ఇంతకుముందు బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ల కంటే విభిన్నంగా వుండే ఈ క్యారెక్టర్ తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని బాలయ్య కూడా నమ్ముతున్నాడు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ మూడు పాత్రలు చేస్తున్నారు. సింహా వంటి సూపర్ హిట్ ని మరోసారి ఇవ్వాలని బాలయ్య భావిస్తున్నారు. దర్శకుడు పరుచూరి మురళి గతంలో గోపిచంద్ తో చేసిన ఆంధ్రుడు హిట్ చూసి బాలకృష్ణ ఈ చిత్రం ఆఫర్ ఇచ్చారు.కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ సి.కుమార్ కెమెరా అందిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.ఇక క్రితం సంక్రాంతికి బాలకృష్ణ పరమ వీర చక్ర చిత్రం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

    English summary
    Natasimha Balakrishna New Movie Under Paruchuri Murali direction has been scheduled for Pongal release on January 12, 2012. Producer ML Kumar Chowdary told that the movie would be ready by that time and we are planning the shooting schedules accordingly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X