Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలయ్య మిత్రుడా..శత్రువా?
బాలకృష్ణ, ప్రియమణి కాంబినేషన్లో మహదేవ్ రూపొందిస్తున్న మిత్రుడు చిత్రం మే డే రోజున రిలీజవుతోంది. ఇక వరస పరాజయాలతో ఉన్న బాలయ్య ఈ చిత్రం మార్కెట్ కాలేదని, దాంతో నిర్మాతే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని దర్శక, నిర్మాతలు ఊదరకొడుతున్నారు. అయితే ఈ చిత్ర కథంటూ ఓ స్టోరీ లైన్ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం లో ఉంది. తారకరత్న భద్రాద్రిరాముడు, రాజేంద్రప్రసాద్ రాంబంటు చిత్రాలని పోలి ఉండేటట్లుగా కథ అల్లారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియమణి జాతకంలో ఓ సమస్య ఉంటుంది. ఆమెను భర్త అకాల మరణం చెందుతాడు.
దాంతో ఆమె ఆ జాతక ఫలం నుంచి తప్పించుకునేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. జీవితమంటే ఆసక్తి లేని, అనాధైన ఓ వ్యక్తిని ప్రేమించి, పెళ్ళాడి అనంతంరం అతనికి విడాకులు ఇచ్చి(మరణిస్తే సరేసరి)తనకు నచ్చిన సంభందం సెట్ చేసుకుందామని నిర్ణయం చేసుకుంటుంది. అలా ట్రాప్ చేయబడ్డ వ్యక్తి మన బాలయ్య. అయితే ఆ తర్వాత విడాకులు ఇమ్మంటే ఇవ్వనంటాడు. ఎందుకు అంటే తాను మిత్రుడులా ఆమెను రక్షించటానికి వచ్చానని ప్లాష్ బ్యాక్ చెప్పుతాడు. దాంతో అతనితో ఆమె నిజంగానే ప్రేమలో పడిపోతుంది.అప్పుడేం జర్గుతుందనేది మిగతా కథ అంటున్నారు.
అలాగే ఇప్పటికే మణిశర్మ రూపొందించిన మిత్రుడు పాటలు మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాగే నిర్మాత కూడా దేనికీ తగ్గక నిర్మాణ విలువల్లో రాజీపడక పాటల్లో రిచెనెస్, సన్నివేశాల్లో క్వాలిటీ ఉండేలా కృషి చేసాడనేది అందరిమాట. పాండురంగడు అనంతరం వస్తున్న చిత్రం కావటంతో అన్ని వర్గాల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకంగా భావించి చేస్తున్న మిత్రుడు చిత్రంలో కొన్ని సన్నివేశాలు గురువారం ఆన్ లైన్ (యు ట్యూబ్)లో దర్శన మిచ్చి చాలా మందని దిగ్భాంతికి గురిచేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఏప్రియల్ నాలుగున ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సమయంలో ఇలా జరగటం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక నిర్మాత కృష్ణ ప్రసాద్ అయితే మీడియా ఎదుటే కన్నీటి పర్యంతమై ఆవేదన చెందారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఇలా జరగటం ఏం చేయాలో అర్ధం కాని స్ధితిని కలిగిస్తోందన్నారు.
ఇక ఎడిటింగ్ టేబుల్ మీదే ఇలాంటివి జరిగేందకు అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేసారు. ఎవరో కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా నెట్ లో లీక్ చేసారని అన్నారు. పోలీసులకు కూడా పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే మరో ట్విస్టు ఏమిటంటే ఈ విషయాన్ని ఓ ప్రెవేట్ ఛానెల్ వారు ప్రసారం చేస్తూ ఆ క్లిప్పింగ్స్ ని, పాటని డౌన్ లోడ్ చేసి మరీ చూపారు. ఈ క్రమంలో బాలయ్య ప్రేక్షకులుకు అభిమానులకు నచ్చి మిత్రుడు అవుతాడా లేక పాత మూసలా అనిపించి శత్రువుగా వెంటాడతాడా అన్నది తేలాలంటే రెండు రోజులు ఆగాలి.