twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందూపురం విజయం తర్వాత... ఇద్దరు పంజాబీ భామలతో బాలయ్య

    |

    ఇటు టాలీవుడ్‌లోనూ, అటు పాలిటిక్స్‌లోనూ నందమూరి బాలకృష్ణ విజృంభిస్తున్నాడు. వరుస సినిమాలతో బాలయ్య యువ హీరోలను మించిపోతున్నాడు. హిందూపురం విజయం తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టిన బాలకృష్ణ.. దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో మరోసారి జతకట్టేందుకు సిద్దమయ్యారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన జైసింహా భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన ఇద్దరు యువ హీరోయిన్లు నటిస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే..

     హిందూపురంలో విజయం

    హిందూపురంలో విజయం

    ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమిపాలైనప్పటికీ.. అనంతపురం జిల్లా హిందూపురంలో నందమూరి బాలయ్య జయకేతనం ఎగురవేశారు. తన నియోజకవర్గంలో పట్టు సాధించి మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇదే ఊపులో తన తాజా చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

    రూలర్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లతో

    రూలర్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లతో

    కాగా, రూలర్ చిత్రంలో బాలకృష్ణ సరసన మెహ్రీన్ పిర్జాదా, పాయల్ రాజ్‌పుత్ ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారనేది తాజా సమాచారం. ఇద్దరు పంజాబీ భామలే కావడం గమనార్హం. పలు చిత్రాల్లో నటించిన మెహ్రీన్‌కు గోల్డెన్ లెగ్ అనే పేరున్నది. ఇక పాయల్ రాజ్‌పుత్ RX 100 సినిమాతో హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నది. వీరిద్దరూ బాలకృష్ణకు తోడైతే ఇక రచ్చ రంబోలానే అంటున్నారు ఫ్యాన్స్. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

     కేఎస్ రవికుమార్‌తో కలిసి

    కేఎస్ రవికుమార్‌తో కలిసి

    రజనీకాంత్‌కు, ఇతర తమిళ హీరోలకు బ్లాక్‌బస్టర్లు అందించిన కేఎస్ రవికుమార్ ఇటీవల బాలయ్యతో కలిసి తెలుగు స్ట్రెయిట్ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జైసింహ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ చిత్రం రూ.50 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం గమనార్హం.

     త్వరలోనే సెట్స్‌పైకి మూవీ

    త్వరలోనే సెట్స్‌పైకి మూవీ

    వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ మూవీ ప్రారంభం కావాల్సింది. స్క్రిప్టు విషయంలో ఆలస్యం కావడంతో ఆ ప్రాజెక్ట్ వెనుకకు వెళ్లి.. కేఎస్ రవికుమార్ సినిమా తెర ముందుకు వచ్చింది. త్వరలోనే ఈ కాంబినేషన్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది. వీరిద్దరి జోడి మళ్లీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

    English summary
    Balakrishna latest movie with Director KS Ravikumar will roll out soon. Reports suggest that Tollywood beuties Mehreen Pirzada, Payal Rajput pair up with Natasimham. Very soon this movie goes onto sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X