Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఇద్దూరు రాస్కెల్స్...?
పెద్ద హీరోలు ఇద్దరు ముగ్గురు కలిసి నటిస్తేనే అది మల్టీ స్టారర్ సినిమా అవుతుంది. ఆ విధంగా త్వరలో తెలుగులో ఓ సినిమా రానుంది. ఇందులో బాలకృష్ణ, నాగార్జున కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. గతంలో ఎన్టీఆర్, నాగేశ్వరరావులు కలిసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే వారి నటవారసత్వంలో వచ్చిన రెండోతరం నటులు బాలకృష్ణ, నాగార్జున. వీరిద్దరు కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి గత కొద్ది కాలంగా అనుకుంటున్నారు. అయితే ఇటీవలే బాలకృష్ణ హిందీలో తెరెకెక్కిన 'చుఫ్ చుప్ కే" చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కు ఇద్దరూ కూడా ఏ విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు.
అయితే తాజాగా సంజయ్ దత్, అజయ్ దేవగన్ నటించిన 'రాస్కెల్స్" చిత్రంలోని వీరి పాత్రలు నాగ్ కు బాగా నచ్చిందట. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని, ఈ రీమేక్ లో బాలయ్యతో నటించాలని నాగ్ చాలా ఆశగా ఉన్నాడంట. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో చూడాలి. మరి నాగార్జున, బాలకృష్ణ లు కూడా ఒప్పుకుంటే ఇక తెలుగు ప్రేక్షకులకు పెద్ద కనువిందే అని చెప్పాలి.