Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య-నాగ్-వెంకీ పొంగల్ కింగ్ ఎవరు??
రెండు దశాబ్ధాలకు పైగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల నడుమ ఆధిపత్యం కోసం పోరు జరిగింది. అయితే మిగిలిన వారిని అధిగమించి చిరంజీవి ఎప్పుడూ నంబర్ వన్ సింహాసనం పై తానే అధిష్టించారు. అప్పుడప్పుడు మిగిలిన ముగ్గురిలో ఎవరో ఒకరు గట్టి పోటి ఇచ్చినా అనుకొన్నంత హిట్స్ ఇవ్వకపోవడంతో, మాస్ ఫాలోయింగ్ ను చిరు స్థాయిలో రాబట్టుకోకపోడంతో టాప్ సీట్ కైవసం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చిరంజీవి రిటైర్ అవ్వడంతో మిగిలిన ముగ్గురిలో ఎవరు ముందంజలో ఉన్నారనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. మాస్ ఫాలోయింగ్ లో బాలయ్య ముందున్నా కొంతకాలంగా వరుస పరాజయాలతో పాలిపోయారు.
వెంకటేష్ కి హిట్స్ వున్నా ప్రధానంగా ఫ్యామిలీ మ్యాన్ గా ముద్ర వేయించుకున్నారు. నాగార్జునా సైతం తన మార్కెట్ పరిధిని ఆశించిన స్థాయిలో పెంచుకోలేదు. అయితే ఇదంతా చిరంజీవి బరిలో వున్నప్పటి సంగతి. ప్రస్తుతం పోటిలో ఈ ముగ్గరే వున్నారు. వీరిలో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎవరిది? డిబేట్ కి దారి తీసే ఈ ప్రశ్నకి సమాధానం ఈ సంక్రాంతికి లభించనుంది. సంక్రాతి బరిలో వీరు ముగ్గరూ నిలవడంతో పోటి రసవత్తరంగా మారింది. బాలయ్య 'సింహా", నాగ్ 'మోసగాడు", వెంకీ 'నమో వెంకటేశ" ఈ మూడిట్లో ప్రేక్షకులు ఎక్కువ ఓట్లు దేనికి వేస్తారో వారే పొంగల్ కింగ్ అవుతారు!