twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దశరాకి బాలయ్య బహుమతి

    By Staff
    |

    Balakrishna
    పాండురంగడు అనంతరం బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తాడు..ఎప్పుడు ప్రారంభమవుతుందనే సందేహాలకు ఇక తెర పడనుంది. దసరా రోజునే ఆయన చేయబోయే రెండు చిత్రాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఒకటి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్న చిత్రం ఒకటి. మరొకటి శ్రీదేవి ఆర్ట్స్ బ్యానర్ పై బాలకృష్ణ చేయబోయే చిత్రం. ఎన్టీఆర్ ఆర్ట్స్ చిత్రానికి ఎన్.శంకర్ దర్శకుడుగా వ్యవరిస్తారని కథ బి.వి.యస్ రవి అనే రచయిత అందిస్తాడని తెలుస్తోంది.

    అలాగే శ్రీదేవి ఆర్ట్స్ వారి చిత్రానికి రాజమౌళి శిష్యుడు మహదేవన్ దర్శకత్వం వహిస్తాడని విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ రెండు చిత్రాలు విజయదశమి రోజే ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. రెండు చిత్రాల్లోనూ ప్రియమణి ఉండబోతోందని సమాచారం. ఇక బాలయ్య రెండు సినిమాలూ ఒకే రోజు ప్రారంభం అవటం అనేది ఆయన అభిమానులుకు దశరా రోజు ఆయనిచ్చే బహుమతి అంటున్నారు. బెస్టాఫ్ లక్ బాలయ్య

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X