Don't Miss!
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బోయపాటి సమక్షంలో బాలయ్య-జూ ఎన్టీఆర్ షో
హైదరాబాద్: విశాఖను అతలాకుతలం చేసిన హుధూద్ తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందకు, భారీగా నిధులు సేకరించేందుకు ఈ నెల 30న ‘మేము సైతం' పేరుతో తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కలిసి భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా పెర్ఫార్మెన్స్ ఇవ్వ బోతున్నారు. త్రివిక్రమ్ సమక్షంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలిసి ఓ స్కిట్ చేయబోతున్నారనే విషయం తెలిసిందే. ఇందులో త్రివిక్రమ్ వారిద్దరికి ప్రశ్నలు వేస్తే...వారు ఆసక్తికరంగా సమాధానాలు ఇవ్వనున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ కార్యక్రమం జరుగనుంది.
అదే విధంగా దర్శకుడు బోయపాటి శ్రీను సమక్షంలో నందమూరి హీరోలు బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ కలిసి కూడా ఓ షో చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో 12 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ స్టార్స్ అంత్యాక్షరి, డాన్స్ ఫ్రోగ్రామ్స్ ఇలా చాలా కార్యక్రమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
తెలుగు పరిశ్రమ లోని యంగ్ హీరోస్ అంతా 4 టీమ్స్ గా విడిపోయి ఈ మ్యాచ్ ఆడనున్నారు. ప్రతి టీంలోనూ 6 మంది ప్లేయర్స్ ఉంటారు, అందులో 4 హీరోస్ ఉంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అలాగే ప్రతి మ్యాచ్ కి 6 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఈ క్రికెట్ మ్యాచ్ మొత్తానికి హెడ్ గా వెంకటేష్ వ్యవహరించనున్నాడు.
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మోహన్ బాబు మొదలైన వారు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. తెలుగు పరిశ్రమ ప్రముఖులతో తమిళ పరిశ్రమ నుండి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు హాజరవుతున్నారు. నవంబర్ 30న టాలీవుడ్ కి సెలవు ప్రకటించారు. పవన్, మహేష్, బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి స్టార్స్ ఉండటంతో ఈ పోగ్రాం ట్రాన్సిమిషన్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫైనల్ గా జెమినీ టీవి వారు ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నారు.