ప్లాపు చిత్రాల దర్శకుడుతో బాలయ్య చిత్రం 27 నుంచి...
ఆంధ్రుడు, రెచ్చిపో వంటి డిజాస్టర్ చిత్రాలు రూపొందించిన పరుచూరి మురళి త్వరలో బాలకృష్ణను డైరక్ట్ చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27 వ తేదీన మొదలవనుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెల నుంచి మొదలవుతుంది. విజయ్.సి.కుమార్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చనున్నారు. ఇదే దర్శకుడుతో గతంలో ఆంద్రుడు,పెదబాబు చిత్రాలు రూపొందించిన శ్రీ కీర్తి క్రియేషన్స్ ఈ నూతన చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం బాలకృష్ణ...దాసరి దర్శకత్వంలో పరమ వీర చక్ర అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
More from Filmibeat
బాలకృష్ణ సింహా కళ్యాణ్ మాలిక్ ఆంద్రుడు పెదబాబు పరుచూరి మురళి balakrishna simha kalyan malik andrudu paruchuri murali


Click it and Unblock the Notifications











