Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పరమవీర చక్ర ప్లాప్ తో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టిన బాలయ్య బాబు
బాలయ్య బాబు, దాసరి దర్శకత్వంలో వచ్చిన పరమవీర చక్ర బాక్సాఫీసు వద్ద చతికిలపడడంతో బాలయ్య బాబు తన తదుపరి చిత్రాలమీద దృష్టిని పెట్టారు. నందమూరి బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్ ఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 3 చిత్రం రెండో షేడ్యూల్ సోమవారం మొదలైంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'బాలకృష్ణ శారీరకభాషకు అనుగుణంగా ఈ కధను తీర్చిదిద్దడం జరిగింది. అభిమానులను రంజింపచేసే అన్ని అంశాలకు ఇందులో పెద్దపీట వేస్తున్నాం. దర్శకుడు పరుచూరి మురళి గతంలో నా సంస్ధలో పెద్దబాబు, ఆంద్రుడు చిత్రాలు చేసారు. మురళి ఓ కసితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కల్యాణి మాలిక్ సంగీతం, విజయ్ సి కుమార్ చాయాగ్రహణం ఆకట్టుకునే విధంగా వుంటాయి. ఈసినిమా విషయానికి వస్తే బాలయ్య బాబు ఇందులో మూడు రకాలైనటువంటి విభిన్నమైన గెటప్ లను వేయనున్నారు. ఈసినిమాలో ఒక హీరోయిన్ గా భూమికను తీసుకోవడం జరిగింది. మరోక హీరోయిన్ గా బాలయ్య బాబు స్వయంగా లక్షీరాయ్ని తీసుకోమని పురమాయించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 24 నుంచి వైజాగ్ లో చిత్రీకరణ చేయబోతున్నాం. అక్కడ వేసిన భారీ సెట్ లో సుమారు నెలరోజులు పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతాం. తోలి షేడ్యూల్ లో ఫైట్స్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఫైట్స్, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం' అని తెలిపారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.