Don't Miss!
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాకు తల్లిలాంటివారు: బాలకృష్ణ
ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ నిన్న కన్నుమూశారు. తెలుగు పరిశ్రమ మొత్తం చూసి వచ్చి సంతాపం ప్రకటించారు. వారిలో...బాలకృష్ణ మాట్లాడుతూ..''నాకు తల్లిలాంటివారు. నాకెంతో ఇష్టమైనవారు. నేనీ మధ్య 'శ్రీరామరాజ్యం' చిత్రంలో రాముని పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో వాల్మీకిగా నటించాలని నాగేశ్వరరావుగారిని అడిగితే... అన్నపూర్ణగారు చాలా ప్రోత్సహించారు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను''అన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ..''నాగేశ్వరరావుగారికి ఇది నిజంగా పూడ్చలేని లోటు. నా సినీ కెరీర్ మొదలైన నాటినుంచి అక్కినేని కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. ఇంటికెళ్లినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారామె. అన్నపూర్ణమ్మగారి మరణం అక్కినేని కుటుంబానికే కాదు... చిత్రపరిశ్రమకే తీరని లోటు. ఈ బాధ నుంచి నాగేశ్వరరావుగారు త్వరగా బయటపడాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నాను''అన్నారు
ఇక ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మాట్లాడుతూ...''అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఆదిదంపతులు. అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగుపెడుతుంటే శివపార్వతుల విగ్రహం కనిపి స్తుంది. ఆ విగ్రహం చూడగానే నాకు ఈ ఇద్దరే గుర్తొస్తారు. అన్నపూర్ణ స్టూడియో పతాకంపై నిర్మించిన తొలి చిత్రం 'కళ్యాణి'కి నేను దర్శ కత్వం వహించాను. ఆ తర్వాత బుచ్చిబాబు, ప్రేమాభిషేకం, యువ రాజుతో కలిపి ఆరు సినిమాలు ఈ సంస్థలో చేశాను. అన్నపూర్ణమ్మ ఎప్పుడూ షూటింగ్కి వచ్చేవారు కాదు. కానీ షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఏదో ఒకటి తినడానికి తీసుకువచ్చేవారు. ఆ రకంగా 'అన్నపూర్ణ' అనిపించుకున్నారు'' అన్నారు. అలాగే మోహన్ బాబు మాట్లాడుతూ..''ఆ మహాతల్లి మరణవార్త ఓ 'షాక్'లా నా మనసంతా కదిలించి వేసింది. ఆ కుటుంబంతో నా అనుబంధం మాటల్లో చెప్పలేనిది. 'కురుక్షేత్రం'లో నా డైలాగులు ఎంతో నచ్చాయని, ఎన్టీఆర్ తర్వాత అలా డైలాగ్స్ నేను మాత్రమే చెప్పగలనని ఆమె నా గురించి అన్న మాటలు ఈ సందర్భంలో గుర్తొస్తున్నాయి. ఆ స్త్రీమూర్తికివే నా కన్నీటి వీడ్కోలు'' అన్నారు.