Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జై సింహా ఆడియో లైవ్.. సింహాన్ని చంపాలంటే.., నరసింహన్ని కొట్టాలంటే..
నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో రానున్న జై సింహ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతున్నది. ఈ ట్రైలర్ను శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ రిలీజ్ చేశారు. ట్ర
నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో రానున్న జై సింహ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతున్నది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ను శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ రిలీజ్ చేశారు. ట్రైలర్లోని ప్రధాన అంశాలు ఇవే...
సింహాన్ని చంపాలంటే..
సింహాన్ని చంపాలనుకోవాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి అనే డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి.
రెండు రాష్ట్రాలకు ప్రాణం
నీవంటే కుంభకోణానికి భయం. నేనంటే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాణం. బొమ్మ తిరగేస్తా అంటూ బాలయ్య ఊగిపోయాడు.
సైలెంట్గా ఉంటే సన్యాసం
సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకొన్నట్టు అనుకోవద్దు. సైలెంట్గా ఉందని దానిని కెలికితే తలను కొరికేస్తుంది అనే డైలాగ్స్ మాస్ ప్రేక్షకులకు తగినట్టుగా ఉన్నాయి.
నయనతారతో రొమాంటిక్గా
అలాగే నయనతారతో రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ఉన్నాయి.
తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక
తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు. తెలుగు సంస్కృతికి వారధి బాలకృష్ణ. టాలీవుడ్ చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తూందనే ఆశాభావాన్ని మండలి బుద్ద ప్రసాద్ వ్యక్తం చేశారు.