Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్స్ ని చూస్తుంటే నా పేరు సార్ధకం ..బాలకృష్ణ
''ఇంతమంది హీరోయిన్స్ అందరూ కలసి నాకు అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. నా పేరు సార్థకం చేసుకొన్నాను అనిపిస్తోంది అన్నారు నందమూరి బాలకృష్ణ. రీసెంట్ గా ఆయన 'సింహా' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా 'సంతోషం' అవార్డును అందుకొన్నారు. వేదిక మీద ఉన్న హీరోయిన్స్ అంతా బాలకృష్ణకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు.అదే వేదికపై మాట్లాడుతూ.. ''ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగానే సినిమాలు తీయాలి. ఇప్పుడు నటులంటే నిత్యావసర వస్తువుల్లాంటివాళ్లు. సినిమా అంటే జనం జీవితంలో భాగం అయిపోయింది. వాళ్లకు ఏయే విషయాలు నచ్చుతాయో వాటిని మేళవిస్తే విజయం అందుతుంద అన్నారు. అలాగే 'సింహా' చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీను అన్నీ తానై నడిపించాడు'' అని మెచ్చుకున్నారు.ఇక ఇదే వేదికపై ఉత్తమ నటిగా అనుష్క (వేదం) అవార్డు అందుకుంది. దర్శకుడు బాపు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును అందుకొన్నారు.