Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మాకు ఆ దమ్ముంటే అభిమానులు కూడా.. : బాలయ్య
వెరైటీ సినిమాలు తీసే దమ్ము మాకు ఉండాలేకానీ ప్రేక్షక దేవుళ్లెప్పుడూ వాటిని ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు...అని వ్యాఖ్యానించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రభుత్వం కూడా నటుల ప్రతిభను గుర్తించి అవార్డులు అందజేయడం అభినందనీయం అన్నారు. ఉగాది సందర్భంగా జరిగిన నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2010 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఆయన మాట్లాడుతూ...''ఇది నా రెండో నంది. తొలిసారి 'నరసింహ నాయుడు'కి తీసుకున్నాను. ఇప్పుడు 'సింహా' చిత్రానికి తీసుకుంటున్నా. ఎన్నో వైవిధ్యమైన పోషించిన నాన్నగారిలాగే...నన్ను కూడా ప్రేక్షకులు, అభిమానులు ఆదరించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వంగా ఉందని, అభినులందరికీ నా ధన్యవాదాలు'' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బాలయ్యను ప్రత్యేకంగా సన్మానించారు. అభిమానులు ఆయనపై పూల వర్షం కురిపించారు.
బాలయ్య ప్రస్తుతం 'అధినాయకుడు' చిత్రంలో నటిస్తున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన లక్ష్మిరాయ్, సలోని నటిస్తున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.