Don't Miss!
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
జై సింహ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ అదుర్స్.. దానవీర శూర కర్ణ నరసింహుడు.. పారిపో..
బాలయ్య.. 102 చిత్రంతో మరోసారి సంక్రాంతి బరిలో దూకారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను మంగళవారం రిలీజ్ చేశారు.
Recommended Video
ప్రముఖ నిర్మాత చిల్లర కళ్యాణ్ సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 102వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ను బుధవారం మధ్నాహ్నం 4.44 గంటలకు రిలీజ్ చేశారు.
దానవీర శూర కర్ణ నరసింహుడు
వైజాగ్ బీచ్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చూపుతూ మోషన్ పోస్టర్ ప్రారంభవుతుంది. దానవీర శూర కర్ణ నరసింహుడు అతడు అనే పాటతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది.. కదిరి నరసింహుడు అతడు..పారిపో అంటూ వచ్చే డైలాగ్స్తో పాట ఆకట్టుకునేలా ఉంది.
వైజాగ్లో షూటింగ్
ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్లో 5 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో బాలయ్య నిర్వహించే మహాధర్నా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే బాలకృష్ణ, హీరోయిన్ హరిప్రియపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. అలాగే బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్ను షూట్ చేస్తామని ఇటీవల నిర్మాత సీ కల్యాణ్ తెలిపారు.
సూపర్ హిట్ కావడం ఖాయం
బాలయ్య 102 చిత్రానికి చిత్రానికి "జై సింహా" అనే టైటిల్ ఖరారు చేశాం. బాలయ్య కెరీర్లో సింహా అనే టైటిల్స్తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని ఇటీవల సీ కల్యాణ్ తెలిపిన సంగతి తెలిసిందే.
నవంబర్ 1న ఫస్ట్ లుక్
నవంబర్ 1న సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేసి.. జనవరి 12న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భారీ బడ్జెట్తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం అని కల్యాణ్ పేర్కొన్నారు.