twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ 'పల్లెనిద్ర' లో ఇలా... (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పల్లె నిద్ర చేపట్టిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు చిలమత్తూరు మండలం గాడ్రాళ్లపల్లిలో బస చేశారు. మధ్యాహ్ననానికి ఆ గ్రామాన్ని చేరుకున్న బాలయ్య సంబంధిత సర్పంచ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో విడివిడిగా చర్చించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో బస కోసం ఏర్పాటు చేసిన గదిలోకి బాలయ్య వెళ్ళిపోయారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. రూ.20లక్షలతో హిందూపురం ఆస్పత్రి అభివృద్ధి, వంద పడకలుగా పెంచుతున్నట్లు చెప్పారు. హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామన్నారు.

    ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, శిక్షణ ఇప్పించేందుకు త్వరలో ఎన్టీఆర్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం రూ.60లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. హిందూపురాన్ని స్మార్ట్‌ ఎల్‌ఈడీ సిటీగా ఎంపిక చేయాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును, మున్సిపల్‌ మంత్రి నారాయణతో చర్చించి, ప్రతిపాదించినట్లు చెప్పారు.

     Balakrishna's Palle Nidra in Hindupur!

    బాలకృష్ణ తాజా చిత్రం విషయానికి వస్తే...

    ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు.

    రుద్రపాటి రమణారావు నిర్మాత. అరకులో చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల పాటు అరకులోనే చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

    ''లెజెండ్‌'తో బాలకృష్ణ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు. ఈ చిత్రం కోసం 'వారియర్‌', 'లయన్‌' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

    ఇక బాలకృష్ణ 99 వ చిత్రం విషయానికి వస్తే...

    నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం(99 వ) నికి రంగం సిద్దమవుతున్నాడు. ఆ చిత్రానికి దర్శకుడుని ఎంపిక అయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాసు అని తెలుస్తోంది. ఆ మధ్యన బాలకృష్ణ కోసం కోన వెంకట్, గోపీ మోహన్ ఓ కథ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కథని డైరక్ట్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణతో చేస్తూండటంతో అతను పెద్ద డైరక్టర్ల లీగ్ లోకి వెళ్లినట్లే.

    రీసెంట్ గా బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

    మరో ప్రక్క అందరూ రామ్ చరణ్ తో శ్రీవాస్ ముందుకు వెళ్తారని భావించారు. అయితే ఈ లోగా బాలకృష్ణ ఈ ఆఫర్ ఇవ్వటంతో ఇటు జంప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం విజయాలతో మినిమం గ్యారెంటీ దర్శకుడుగా అతను టాలీవుడ్ లో సెటిల్ అయినట్లే. బాలకృష్ణతో కూడా అదే మాదిరిగా హిట్ కొడితే అతనికి తిరుగు ఉండదని సినీ వర్గాలు అంటున్నాయి.

    English summary
    Nandamuri Balakrishna is actively participating in the 'Palle Nidra' program of TDP Government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X