Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలకృష్ణపై రూమర్ నిజమైంది
బాలకృష్ణతో సామాన్యుడు ఫేం రవిచావలి ఓ చిత్రం రూపొందిస్తున్నారంటూ రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ప్లాపుల్లో ఉన్న రవిచావలికి బాలకృష్ణ డేట్స్ ఎందుకు ఇస్తారు..రూమర్ అని అంతా కొట్టిపారేసారు.అయితే అది రూమర్ కాదని వార్తలు నిజమేనని,రవిచావలి ఆ ప్రాజెక్టుకు సంభంధించిన డిటేల్స్ లో మీడియా ముందుకు రావటంతో అంతా ఆశ్చర్యపోయారు.వివరాల్లోకి వెళితే..తెలుగులో వరసగా భారీ చిత్రాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న సంస్ధ ఆర్.ఆర్.మూవీ మేకర్స్.
వారు తాజాగా బాలకృష్ణతో ఓ ప్రాజెక్టుని ఓకే చేసారు.తమ అనుబంధ సంస్ధ ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.సామాన్యుడు ఫేం రవికుమార్ చావలి దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం 2012 జనవరిలో మొదలుకానుంది.ఈ విషయం మీడియాకు తెలియచేస్తూ నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ... '''మిరపకాయ్" తర్వాత మంచి హిట్ సినిమా తీయాలనే తలంపుతో ఎన్నో కథలు విన్నాను.
చివరకు బాలకృష్ణగారి కోసం రవి చావలి తయారు చేసిన కథ మాకెంతో నచ్చింది.ఈ కథ బాలకృష్ణగారు విని ఎంతో ఇన్స్పైర్ అయ్యారు.'శ్రీరామరాజ్యం"బాలయ్య కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచింది.ఇప్పుడు మా సంస్థ ద్వారా రానున్న ఈ సినిమా ఆయన కెరీర్లో సెన్సేషనల్ మూవీగా నిలుస్తుంది.బాలకృష్ణ పాత్రను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి. వచ్చే యేడాది జనవరి నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం.
పూర్తి వివరాలు త్వరలో చెబుతామని అన్నారు.బాలకృష్ణగారితో పనిచేయడం గర్వంగా ఉందని, ఇందులో బాలకృష్ణలోని కొత్త కోణాన్ని చూస్తారని రవికుమార్ చెప్పారు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం"విజయోత్సాహంలో ఉన్నారు.అలాగే మంచు లక్ష్మీ నిర్మిస్తున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా" షూటింగ్లో పాల్గొంటున్నారు.పరుచూరి మురళి దర్శకత్వంలో ఆయన నటించిన 'అధినాయకుడు" నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది.