బాలకృష్ణ 'సింహా' చిత్రం సెన్సార్ కట్స్ ఇవే...
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలైన 'సింహా' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ కట్స్ ఇలా ఉన్నాయి. మొదటి రీలులో 'అందమైన అమ్మాయిలు వెంటపడి..నుంచి...వాళ్ళు హర్ట్ అవనంతవరకు' గల డైలాగ్ వినబడకుండా శబ్దాన్ని కట్ చేసారు. మొదటి రీలులోనే వేణుమాధవ్ అన్న 'గుడ్డుకు' పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
అలాగే 'లంజకొడకా' పదం సినిమాలో ఎక్కడ వచ్చినా ఆ శబ్దం తొలగించి వినరాకూడదన్నారు. ఇక ఏడవరీలులో హీరో ఇంటిముందు జరిగిన ఫైట్ సన్నివేశాలన్ని 40 శాతం తొలగించడం ద్వారా 40 అడుగుల ఫిలిం కట్ చేసారు. తొమ్మిదవ రీలులో చిత్రీకరించిన 'సుఖం లేకపోతే మాలాంటి వాళ్లను చూసుకో' అనే డైలాగ్ ని తొలగించి శబ్దం వినబడనీయవద్దన్నారు. తొమ్మిదవ రీలులోనే మనిషిని లాగి చంపే దృశ్యాలను, నూతిలోకి తోయడం, శవాలను బావిలో చూపించడం, శవాలను ఇసుకలో పెట్టడం వంటి దృశ్యాలను 118 అడుగుల మేర కత్తిరించారు.
తొమ్మిదవ రీలులోనే రైల్వే స్టేషన్ వద్ద చిత్రీకరించిన ఫైట్ సన్నివేశాన్ని 40 శాతం కత్తిరించడం ద్వారా 37 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది. పదకొండవ రీలులో 'మూసుకుని పడుకో' అని రెండుసార్లు చిత్రీకరించిన మాటలను తొలగించి అవి వినబడ కూడదన్నారు. పన్నెండవ రీలులో స్థూపం వద్ద చిత్రీకరించిన ఫైట్ ని 40 శాతం తగ్గించడం ద్వారా 70 అడుగుల ఫిలిం కత్తిరింపు అయింది.
5 గురు సభ్యులతో కూడిన 'ఇ.సి.' 'సింహా' చిత్రాన్ని చూసి 9 కట్స్ తో 265 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరించి 'ఎ' సర్టిఫికెట్ ని 26-4-2010న జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన అనంతరం 'జానకి జానకి జానకి ఎక్కడికి పోవాలే జానకి...నుంచి...మరీ లేట్ అయితే బాగోదు లేటు నైట్ ఆటకి' అనే పాటను కలపడంతో 415.12 అడుగుల నిడివిగల ఈ పాటను కట్స్ లేకుండా అనుమతించారు. ఈ కట్స్ తో 16 రీళ్ల నిడివితో ఈ చిత్రం సెన్సార్ వారు ఓకే చేసారు. ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మించారు. నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేసారు.


Click it and Unblock the Notifications











