Don't Miss!
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తెలుగుదేశం నేతలను కొట్టిన బాలయ్య
తనను కలవడానికి వచ్చిన తెలుగుదేశం నేతలపై నటుడు బాలకృష్ణ చేయిచేసుకోవంటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన ఆయన అభిమానులను నిరుత్సాహపరచింది. బాలయ్య చేతి దెబ్బ రుచి చూసిన నేతలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను హీరోగా నటించిన సింహా చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా బాలకృష్ణ గురువారం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు శ్రీకాళహస్తికి విచ్చేశారు. బాలయ్యను చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరితోపాటు స్థానిక టీడీపీ నేతలు సైతం దక్షిణ గోపురం సుపథ మండపం వద్ద స్వాగతం పలికారు.
అక్కడినుంచి అభిమానుల కేరింతల మధ్య బాలయ్య ముక్కంటి దర్శనం కోసం బయలుదేరారు. ప్రధానద్వారమైన కంచుగడప ద్వారా లోనికి ప్రవేశిస్తుండగా జనంమధ్యలో ఓ టీడీపీ నేత బాలకృష్ణకు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహించిన బాలయ్య ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం కంచుగడప దాటుకుని వినాయకుని గుడి వద్దకు వెళ్తుండగా మరో నేత పార్టీ కండువా వేయడానికి ప్రయత్నించారు. ఇది బాలయ్యకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. సహనం కోల్పోయిన ఆయన ఆ నాయకుని చెంప చెళ్లుమనిపించారు. దాంతో ఆ నాయకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నిజానికి శ్రీకాళహస్తికి బాలకృష్ణ పర్యటన ఖరారైనప్పటి నుంచి ఆయనే ఏర్పాట్లు చేయటం విశేషం.