జూ ఎన్టీఆర్ కృష్ణుడైతే బాలయ్య రాముడు అయ్యే తరుణం...
అయోద్య కేసు పుణ్యమా అని బాలయ్య-బాపుల'శ్రీరామరాజ్యం" వెనక్కి వెళ్ళిపోయింది. యావత్ ప్రపంచాన్ని ఉత్సూకతకు గురిచేసిన ఈ కేసు కాస్తా..తీర్సుతో చప్పగా తయారవడంతో, బాలయ్య తన ఈ చిత్రాన్నిమళ్లీ ఎప్పుడు మొదలెడతాడా అని అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ తరం సినీ అభిమానులకు పౌరాణికాలు దూరమవుతున్న సమయంలో నటసింహం నందమూరి బాలయ్య మళ్లీ అలనాటి చిత్ర రాజాలకు పునర్వైభవం తేవాలనుకోవడం గొప్ప విషయమే. మరి బాపులాంటి శిల్సి చేతిలో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం గొప్ప విషయమే. మరి బాపులాంటి శిల్సి చేతిలో ఈ చిత్రం రూపుదిద్దుకోవడంతో బాలయ్య అభిమానుల ఆరాటం ఎక్కువైంది. 'బృందావనం"లో కృష్ణునిగా జూ ఎన్టీఆర్ ని చూసిన నందమూరి అభిమానులు..తదుపరి 'శ్రీరామరాజ్యం"లో బాలకష్ణుని ఆగమనం కోసం వేచి చూస్తున్నారు. మరి ఇంతవరకు ఈ చిత్రం కు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడవ్వలేదు.. అధికారికంగా పూర్తి వివరాలు వెలుగులోనికి వచ్చే వరకు నందమూరి అభిమానులు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











