Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' లేటెస్ట్ ఇన్ఫో
పౌరాణిక చిత్రాల్లో 'శ్రీరామరాజ్యం' ప్రత్యేకంగా నిలుస్తుంది. శ్రీరాముడి పాలనను తెర మీద చూడొచ్చు. ఇళయరాజా స్వరపర్చిన పాటల రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా సెట్ని తీర్చిదిద్దామన్నారు నిర్మాత యలమంచిలి సాయిబాబు. శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం'. బాపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణునిగా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 2 నుంచి 8 వరకు చిత్రీకరణ జరిపారు. సమ్మె కారణంగా తాత్కాలికంగా షూటింగ్ ఆపామని సాయిబాబు తెలిపారు. "ఇప్పటికి సగం పాటనూ, కొంత టాకీని చిత్రీకరించాం. ఇందులో ప్రధాన తారాగణంతో పాటు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. వాల్మీకి ఆశ్రమానికి సంబంధించిన సెట్ను భారీ స్థాయిలో వేశాం. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా అప్పటి 'లవకుశ' స్థాయికి ఈ చిత్రాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాం అన్నారు.
బాలయ్య, మురళీమోహన్, బ్రహ్మానందం, రఘునాథరెడ్డి, సుబ్బరాయశర్మ, విందు ధారాసింగ్, కె.ఆర్. విజయ, జయసుధ, సుధ, సన, ఝాన్సీ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి, జొన్నవిత్తుల, ఛాయాగ్రహణం: పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీందర్, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, కాస్ట్యూమ్స్: తిరుమల, కొరియోగ్రఫీ: శ్రీను.