శ్రీరాముడు' రాజుగా పాలించిన ఘట్టమే బాలయ్య ‘శ్రీరామరాజ్యం’....
శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార నటించే శ్రీరామరాజ్యం" చిత్రం షూటింగ్ ఈ నెల 22న ప్రారంభం కానున్నది. బాపు దర్శకత్వంలో శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది పాటల రికార్డింగ్ పూర్తియంది. ఈ సంగతిని నిర్మాత సాయిబాబు తెలియజేస్తూ '22న నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియోస్ లో ఉదయం 10గంటలకు 'శ్రీరామరాజ్యం" చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభిస్తాం. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం" అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నలకంటి, సినిమాటోగ్రఫి: పి. ఆర్ కె.రాజు, కూర్సు:జిజి కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్ కమల్ కణ్ణన్, డాన్స్ఝ: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్ర్కీన్ ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.


Click it and Unblock the Notifications











