Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిత్రాన్ని మోసేది అభిమానులే: బాలకృష్ణ
ప్రతి చిత్రాన్నీ మోసేది అభిమానులే. కానీ బాగా ఆడాలంటే మాత్రం అందరూ చూడాల్సిన కథలే ఒప్పుకోవాలి.కేవలం అభిమానుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథల్ని ఒప్పుకోకూడదు అంటున్నారు బాలకృష్ణ. శుక్రవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సింహా చిత్రం విజయం గురించి చెప్పారు. అలాగే కథ ఒప్పుకునేటప్పుడు జనాలందరికీ నచ్చుతుందా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఇప్పటి ప్రేక్షకులు చాలా తెలివైనవారు. నేను 'సింహా' సినిమాలో లెక్చరర్ గా, డాక్టర్ గా కనిపిస్తాను అని ముందే తెలిస్తే కథ ఇట్టే ఊహించేస్తారు. ఆ విషయం తెర మీదే తెలిసింది కాబట్టి వారికి కొత్తగా అనిపించింది అన్నారు.
ఇక నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 34 సంవత్సరాలైంది. అన్ని రకాల పాత్రలూ చేశాను. కానీ సింహా చూసినవాళ్లంతా 'ఇప్పుడు తెలిసింది బాలకృష్ణ సినిమా ఆడాలంటే ఏం కావాలో..' అంటున్నారు. ఓ కళాకారుడికి అంతకంటే కావల్సింది ఏముంది. ఇది ఆశ్చర్యంతో కూడిన ఆనందం. దర్శకుడు బోయపాటి శ్రీను కథ చెప్పినప్పుడే హావభావాలు ఏ మోతాదులో చేయాలో నిర్ణయించేసుకొన్నాను. సంభాషణలు కూడా సూటిగా ఉండేలా రాశారాయన. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా 'అర క్షణంలో చచ్చేవాడివి నీకెందుకురా నా అడ్రస్' అంటూ డైలాగులు చెబుతున్నారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.