హిందూపురం నుంచి బాలయ్య పోటీ?

అలాగే ఆయన తెలుగు దేశం పార్టీ గెలిచే దాకా తాను ప్రచారం చేస్తానని ఆయన బాలకృష్ణ స్పష్టం చేయటం ఈ నిర్ణయానికి మరింత బలం చేకూరుస్తోంది. ఆయన తండ్రిగారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 13వ వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారన్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య పూర్తి స్ధాయిలో పార్టీ ప్రచారానికి నడుం బిగించనున్నారు. అందుకోసం ఆయన పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్ళనున్నారు.
బాలయ్య ఈ నెల 29న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.అందునిమిత్తం బాలయ్య రోడ్షోలకు ప్రత్యేక వాహనాన్ని రెడీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బాలయ్య తన రోడ్షోలకోసం ప్రత్యేకవాహనాన్ని తయారు చేయించుకుంటున్నట్లు తెలిసింది. యాత్రలకు తరలివచ్చే అభిమానులందరికీ తాను కనిపించే విధంగా, అవసరమైతే స్థానిక నేతలతో మాట్లాడేందుకు అనువుగా ఈ వాహనం రూపు దిద్దుకుంటోందని సమాచారం.మొత్తానికి చూస్తుంటే బాలయ్య ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి దిగినట్లు అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











