Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
స్పెషల్ పెర్ఫార్మెన్స్: పాట పాడబోతున్న బాలయ్య
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం కలిసి ఈ నెల 30 ‘మేము సైతం' పేరుతో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో నందమూరి నటసింహం బాలయ్య రెండు సాంగులకు పాట పాడబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి అండ్ బ్యాండ్తో కలిసి బాలయ్య తన సింగింగ్ టాలెంట్ ప్రదర్శించబోతున్నారు.
బాలయ్యతో పాటు ఇతర హీరోలు ఎవరికి తోచిన విధంగా వారు వివిధ వినోద కార్యక్రమాల్లో పాల్గొన బోతున్నారు. రు. వెంకటేష్, బ్రహ్మానందం, అలీ కాజల్ కలిసి ‘పెళ్లి కాని ప్రసాద్' పేరుతో స్కిట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కిట్ ప్రేక్షకులను కుడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుందని అంటున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రకాల కార్యక్రమాలు ఎన్ని ఉన్నా.....అందరూ ఓ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది మరేదో కాదు.....మహేష్ బాబు, త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ కలిసి చేసే స్కిట్ కోసం. అసలు వీరిలో ఏ ఒక్కరు స్కిట్ చేసినా అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటిది ముగ్గురు కలిసి స్కిట్ చేస్తే టాప్ లేచి పోవాల్సిందే. ఇటీవల జరిగిన మేము సైతం ప్రెస్ మీట్లో నిర్మాత సురేష్ బాబు ఈ స్కిట్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
పవన్, త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి ఓ స్కిట్ చేస్తారు. అదే విధంగా ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కలిసి మరో స్కిట్ చేస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ రెండు టీములుగా విడిపోయి కబడ్డీ ఆడుతున్నారు అని సురేష్ బాబు తెలిపారు. క్రికెట్ మ్యాచ్ విషయానికొస్తే..... స్టార్స్ అంతా మొత్తం నాలుగు జట్లుగా ఏర్పడనున్నారు. ఈ జట్లకు వెంకటేష్, నాగార్జున, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బిడ్డింగ్ ప్రాసెస్లో వేలం ద్వారా ఆయా జట్లకు ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. జట్లలో హీరోలతో పాటు, హీరోయిన్లు కూడా ఉండనున్నారు. నవంబర్ 27న జట్ల ఎంపక జరుగుతుంది. బిడ్డింగ్ ప్రాసెస్ లో జట్ల ఎంపిక కార్యక్రమం ఈ నెల 27న రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో కెప్టెన్లు తమ జట్టు సభ్యులను ఎంచుకుంటారు.