Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలయ్య సినిమా మళ్లీ వాయిదా!
నందమూరి నటసింహం బాలకృష్ణ, మంచు మనోజ్ మల్టీ స్టారర్గా రూపొందుతున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. తొలు ఈచిత్రాన్ని జూన్ 22న విడుదల చేసేయాలని ప్లాన్ చేశారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ జులై మెదటి వారానికి వాయిదా పడింది.
ఈ చిత్రం వాయిదాకు కారణం పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడమే అని స్పష్టమవుతోంది. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం బాలయ్య ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన జమిందార్ పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు రూ. 6 కోట్లతో వేసిన గాంధర్వ మహల్ సెట్ హైలెట్గా నిలవనుంది. సినిమా ఎక్కువ శాతం షూటింగు ఇందులోనే జరిగింది.
బాలయ్య ఈ చిత్రంలో ఆత్మ రూపంలో కనిపించనున్నారు. గాంధర్వ మహల్లోకి హీరో మనోజ్ ప్రవేశించాక కథ మొదలవుతుందని, అక్కడ బాలకృష్ణ ఆత్మ కలుస్తుందని, హర్రర్, కామెడీ కలగలిసే ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ విన్న హీరో ఆయన ఆశయం తీర్చటమే సినిమా ముఖ్య కథాంశం అని తెలుస్తోంది. మనోజ్ సరసన దీక్షాసేథ్ నటిస్తోంది.
బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రాన్ని మంచు లక్ష్మి ప్రసన్న మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తోంది. ఈ చితానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శేఖర్ రాజ. బెబో శశి సంగీతం అందిస్తున్నారు. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.