Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బోయపాటికి బాలకృష్ణ పరామర్శ.. డైరెక్టర్ ఇంటికెళ్లి మరీ ఓదార్చిన నటసింహం
టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన ఇంటికెళ్లి మరీ పరామర్శించారు. గత శుకృవారం బోయపాటి తల్లి సీతారావమ్మ (80) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
అయితే ఈ రోజు (బుధవారం) ఉదయం నేరుగా బోయపాటి స్వగ్రామం (గుంటూరు జిల్లా పెదకాకాని) వెళ్లి.. ఆయన తల్లి సీతారావమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు బాలకృష్ణ. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బాలయ్య విజయవాడలో ఉన్న ఆయన నేరుగా గుంటూరు వెళ్లి బోయపాటిని పరామర్శించారు. ఈ మేరకు కాసేపు ఆయనతో ముచ్చటించి ఓదార్చారు.
ఇటీవలే రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డీలాపడిన బాలయ్య బాబు తన తదుపరి సినిమాను బోయపాటి దర్శకత్వంలోనే చేయనున్నారు. బాలయ్య 106వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్స్ చేస్తున్నారు బోయపాటి. . మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిననున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నాడు. బాలయ్య సరసన హీరోయిన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య- బోయపాటి సక్సెస్ఫుల్ కాంబో కాబట్టి ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.