Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య
సినీ హీరో బాలకృష్ణ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీరామరాజ్యం సినిమా విడుదల నేపథ్యంలో ఆయన ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థన చేశారు. విఐపి ప్రారంభ దర్శనంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన శుక్రవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు.
బాలకృష్ణ శుక్రవారం శ్రీకాళహస్తిలో ముక్కంటికి పూజలు చేసిన విషయం తెలిసిందే. బాలయ్య హైదరబాదు నుండి ఉదయం శ్రీకాళహస్తి చేరుకోగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు త్రినేత్ర అతిథి గృహం వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి బాలయ్య ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో బాలయ్య రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనను ఆశీర్వదించి స్వామి వారి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందించారు.అనంతరం బాలయ్య బుచ్చినాయుడు కండ్రిగలోని ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు.