twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీరాభిమాని ఇంటికి బాలయ్య

    By Staff
    |

    బాలకృష్ణ వీరాభిమాని నయనార్ రఘు(ఎన్ బి కె రఘు)శ్రీకాళహస్తిలో బుధవారం మరణించారు. మరుసటి రోజు బాలయ్య తన షెడ్యూలు ప్రక్కన పెట్టి అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మూడు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. అంతేగాక అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని అతని కూతురుకు ఉద్యోగం ఇప్పిస్తానని ప్రామిస్ చేసారు. ఇక నయనార్ రఘు నేటివ్ శ్రీకాళహస్తి. మొదటి నుంచీ నందమూరి ఫ్యామిలీ అంటే అభిమానం చూపేవాడు..అందులోనూ బాలకృష్ణ అంటే ప్రాణం పెట్టేవాడు. అతను మరణించటంతో ఎక్కడెక్కడి బాలకృష్ణ అభిమానులు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్సిస్తున్నారు. రఘు కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక బాలకృష్ణ ఆ ఇంటివద్ద ఒక గంటకు పైగా గడిపారు. ఆయన్ని చూడటానికి జనం ఎగబడ్డారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ..బోయపాటి శీను దర్శకత్వంలో సింహా చిత్రాన్ని చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X