Don't Miss!
- News AP Volunteers: 62 వేలకు చేరిన వాలంటీర్ల రాజీనామాలు-ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం.. !
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
జన గండం ఉందని బాపు భయపడే వారు
విశాఖపట్నం : ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్టు బాపుకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని ప్లాటినం జూబ్లీ ఆడిటోరియంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరై బాపుతో తన అనుభవాలను పంచుకున్నారు.
‘బాపు అత్యంత సున్నిత మనస్కుడని, ఆయనకు పొగడ్తలు, పురస్కారాలు, జనం అంటే భయ పడే వారని...తనకు జన గండం ఉందని చెప్పే వారని' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. బాపు లాంటి గొప్ప కళాకారుడు దూరం కావడం తీరని లోటని ఆయన అన్నారు.
బాపు, రమణల స్నేహ బంధం అనిర్వచనీయమైనదని, ముక్కసూటిగా వెళ్లే బాపుని రమణ ఎప్పుడూ కాపాడేవారన్నారు. బాపు దర్శకత్వంలో వచ్చిన బుల్లెట్, సీతమ్మ పెళ్లి చిత్రాలకు తాను సంగీతం అందించినట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. హనుమంతుడి మీద తనకొడుకు, బాపు కొడుకులతో ఓ యానిమేషన్ చిత్రం తీయాలనుకున్నాం, కానీ ఆ చిత్రం తీయకుండానే ఆయన వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి జి.ఎస్.ఎన్.రాజు, సెంటర్ ఫర్ పాలనీ స్టడీస్ సంచాలకులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.