భార్య, కూతురుతో కలిసి బాలయ్య ఇలా (ఫోటోలు)
హైదరాబాద్: సినీ నటుడు బాలయ్య భార్య వసుంధర, కూతురు తేజస్వినితో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో బాలయ్య ఓటు వేసారు.
అయితే బాలయ్యకు ఈ సారి విచిత్ర పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ తెలుగు దేశం పార్టీకి ఓటేయలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగు దేశం పార్టీ, బీజేపీ పొత్తులో భాగంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ, సికింద్రాబాద్ పార్లమెంటు నియెజకవర్గాలను కమలం పార్టీకి కేటాయించడంతో వారు తెలుగు దేశం పార్టీకి కాకుండా బీజేపీ పార్టీకి ఓటేసినట్లు తెలుస్తోంది.
బాలయ్య తన ఫ్యామిలీతో కలిసి ఓటు వేసిన ఫోటోలు స్లైడ్ షోలో.....

బాలయ్య 1
ఓటు వేయడానికి వస్తున్న బాలయ్య.

బాలయ్య 2
బాలయ్యతో పాటు ఆయన భార్య వసుంధర, కూతురు తేజస్విని కూడా ఓటు వేయడానికి వచ్చారు.

బాలయ్య 3
ఓటు వేసిన అనంతరం వేలు చూపుతున్న బాలయ్య

బాలయ్య 4
ఓటు వేసిన అనంతరం వేలు చూపుతున్న బాలయ్య, వసుంధర, తేజస్విని


Click it and Unblock the Notifications











