Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నర్తనశాలపై మనసు పారేసుకుంటున్న బాలయ్య
బాలకృష్ణ నర్తనశాల సినిమాపై మనసు పారేసుకుంటున్నరట. ఈ సినిమాను చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ద్రౌపది పాత్రకు ఎంపికైన సౌందర్య అకాల మృతితో నర్తనశాల సినిమా నిర్మాణం ఆగిపోయింది. బాలయ్యకు ఇది డ్రీమ్ ప్రాజెక్టేనట. అయితే, లగాన్ సినిమాలో నటించిన గ్రేసీ సింగ్ను ద్రౌపది పాత్రకు ఎంపిక చేసి సినిమా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అనుకున్నట్లు 2009లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్నేహను ద్రౌపది పాత్రకు ఎంపిక చేసి మగధీర సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులను తీసుకుని అద్భుతంగా చిత్రాన్ని నిర్మించాలని కూడా బాలయ్య అనుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, అది కూడా కార్యరూపం ధరించలేదు.
తాజాగా, మళ్లీ నర్తనశాల సినిమా చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ పడినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి పాత తరం నటులు నర్తనశాల సినిమాను రక్తి కట్టించారు. ఎన్టీఆర్ నటించిన బృహన్నల పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించాలని బాలయ్య ఉవ్విళ్లూరుతున్నారట. నాట్యాచారిణిగా బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ నటనను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు.