Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ధీమ్ సాంగ్ అదిరింది...మెచ్చుకున్న బాలకృష్ణ
థీమ్ సాంగ్ చాలా బాగా వచ్చింది. అనంత్శ్రీరామ్ బ్రహ్మాండంగా పాట రాస్తే, కీరవాణి అద్భుతంగా బాణీలు సమకూర్చారు. మా మనోభావాల్ని చెబుతూ ఆపదలో ఉన్నవారికి ధైర్యం చెప్పేలా ఉందీ గీతం. పలువురు మా కార్యక్రమానికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు అని బాలకృష్ణ తెలిపారు. వరద బాధితుల సహాయార్థం ఈ నెల 7న జరుప తలపెట్టిన స్టార్నైట్ కార్యక్రమానికి సంబంధించి కర్టెన్ రైజర్లాంటి థీమ్ సాంగ్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ రూపొందించింది. 'ఓ తమ్ముడా..ఓ చెల్లెలా..మరచిపోండి ఆ పీడకల' అంటూ సాగే ఆ పాటకు అనంత్శ్రీరామ్ సాహిత్యం అందించగా, ఎం.ఎం.కీరవాణి సంగీత బాణీలు కూర్చి, పాడారు.
సోమవారం సాయంత్రం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో జరిగిన కార్యక్రమంలో సీనియర్ డైరెక్టర్, 'స్పందన' కమిటీ గౌరవ ఛైర్మన్ డా. దాసరి నారాయణరావు ఈ థీమ్ సాంగ్ ఉన్న ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని సీనియర్ సంగీత దర్శకుడు కోటికీ, మలి ప్రతిని 'స్పందన' ఎగ్జిక్యూటివ్ ఛైర్యన్, హీరో బాలకృష్ణకూ అందజేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ "ఈనెల 7న జరిగే స్టార్నైట్లో 14 మంది సంగీత దర్శకులు స్టేజి మీద తమ ప్రోగ్రామ్స్ని ఇవ్వబోతున్నారు. 80 నుంచి 100 మంది నటీనటులు ఇందులో పాల్గొనబోతున్నారు. హిందీ, తమిళ, కన్నడ చిత్ర రంగాలకు చెందిన నటులు హాజరవబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మూడున్నర కోట్ల రూపాయలకు మించి ఆదాయాన్ని సమకూర్చి వరద బాధితులకు అందజేయాలని సంకల్పించాం" అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మురళీమోహన్, కేసీ శేఖర్బాబు, మన్యం రమేష్, ఏవీఎస్, కె.అచ్చిరెడ్డి, జీవిత, రాజశేఖర్, అలీ తదితరులు పాల్గొన్నారు.