twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ..ప్రకాష్ రాజ్ బ్యాన్ ఇష్యూ

    By Staff
    |

    Prakash Raj
    ఆ మధ్య ప్రకాష్ రాజ్ పై తెలుగు పరిశ్రమ బ్యాన్ పెట్టింది. అయినా ఆయన అన్ని షూటింగ్ లకు సీక్రెట్ గా అడెండయ్యారు(కొత్త బంగారు లోకంతో సహా ).ఈ లోగా ఆ బ్యాన్ ఎత్తేసారు. ఆ సెటిల్ మెంట్ ని నిర్మాతల మండలి అధ్యక్షుడు హోదాలో తమ్మారెడ్డి భరద్వాజ చేసారు. అయితే నిన్న ఆయన రిలే నిరాహార దీక్ష పై మీడియా వారితో ఇలా టెంట్‌ వేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం సమంజసం కాదని కామెంట్ చేసారు. దాంతో ప్రకాష్ రాజ్ విషయాన్ని గుర్తు చేస్తూ..నిరాహార దీక్ష కమిటీ కన్వీనర్‌ చదలవాడ శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో భరధ్వాజని విమర్శించారు.

    'ఎన్నో ఏళ్ల నుండి చిన్న నిర్మాతలు తమ బాధలు చెప్పుకుంటున్నా మీరు ఏ మాత్రం న్యాయం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి. నిర్మాతలమండలి అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మండలి సభ్యుడైన జ్యోతిప్రసాద్‌ వ్యవహారంలో నటుడు ప్రకాశరాజ్‌తో ఒక సెటిల్‌మెంట్‌ చేసిన మీరు అతను పూర్తి డబ్బు చెల్లించకుండానే అతనిపై ఉన్న బ్యాన్‌ని ఎత్తి వేశారు. దీని వల్ల జ్యోతిప్రసాద్‌ ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి మీకు ఇతరుల గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? మీ లోపాలను ఎవరు ప్రశ్నిస్తారో అని భయపడి పదవికి రాజీనామా ఇచ్చారు. అసలు మీరు అధ్యక్షపదవికి అనర్హులని మేమంతా అంటున్నాం' అంటూ ఆ ప్రకటనలో తీవ్ర విమర్శ చేశారు. అలాగే భరద్వాజ ఇలా పేర్కొనడం ఆయన పెద్దరికాన్ని కించపరిచే విధంగా ఉందని ఆయనపై ధ్వజమెత్తారు.అయితే నిరాహార దీక్ష విరమణతో అంతా ఒకటయ్యారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X