Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
19 ఏళ్ళ అమ్మాయి 10 ఏళ్ళ అబ్బాయి హనీమూన్: ఆ టీవీ సీరియల్ ఆపండీ
విభిన్న కథాంశం అన్న పేరుతో మరీ వికృతమైన సబ్జెక్ట్స్ తో వస్తున్నారు కొన్ని మరీ హద్దు మీరిన కథావస్తువులు కావటం ఇంకా దారుణం గా ఉంది.
విభిన్న కథాంశం అన్న పేరుతో మరీ వికృతమైన సబ్జెక్ట్స్ తో వస్తున్నారు కొన్ని మరీ హద్దు మీరిన కథావస్తువులు కావటం ఇంకా దారుణం గా ఉంది. ఇప్పుడు ప్రసారమవుతున్న హిందీ సీరియల్ "పెహ్రేదార్ పియా కీ" సీరియల్పై కేంద్ర జౌళి శాఖ, సమాచార ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రైమ్ టైమ్లో వస్తున్న ఈ సీరియల్ పిల్లల ఆలోచనా విధానాలను మార్చే విధంగా ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పిటిషన్పై 36,282 మంది సంతకాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
ఈ సీరియల్లో అనివార్య కారణాల వల్ల పదేళ్ల బాలుడిని 19 ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. బాలుడు అమ్మాయి నుదుట బొట్టు పెట్టడం, తనను ప్రేమిస్తున్నానని పదే పదే చెప్పడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా ఉంటున్నాయి. ఈ సీరియల్ ప్రారంభానికి ముందే వచ్చిన ప్రోమోలపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. కాకపోతే జూలై 17న ప్రారంభమైన ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ బాగుండటంతో టీఆర్పీ పెరిగిందని ఛానల్ వారు చెబుతున్నారు.