Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కబీర్ సింగ్కు ఎదురుదెబ్బ.. మూవీని నిషేధించాలని ముంబైలో కేసు.. కేంద్రానికి లేఖ
Recommended Video
వివాదాలు, నిరసనలు, అభ్యంతరాల మధ్య కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. ఇప్పటికే క్రిటిక్స్ కొందరు పెదవి విరువగా, ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యురాలు వీణా టిక్కూ ఘాటుగా విమర్శలు సంధించింది. ఇవేమీ పట్టించుకోకుండా ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. అయితే తాజాగా కబీర్ సింగ్ సినిమాపై వైద్యులు మండిపడ్డారు. సినిమాను నిషేధించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకు ఈ వివాదంలో విషయం ఏమిటంటే..
వైద్యవృత్తిని కించపరిచే విధంగా ఉందని
సక్సెస్ దిశగా దూసుకెళ్తున్న కబీర్ సింగ్పై ముంబైకి చెందిన ఓ డాక్టర్ కేసు నమోదు చేశారు. షాహీద్ కపూర్, కియారా అద్వానీ ప్రతివాదులుగా చేర్చారు. వైద్య వృత్తిని కించపరిచే విధంగా సినిమాను తెరకెక్కించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చిత్రంలో షాహీద్ కపూర్ మద్యానికి బానిసైన సర్జన్గా నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా డ్రగ్ ఎడిక్ట్గా కూడా కనిపిస్తాడు.
మనోభావాలను దెబ్బతీసే విధంగా
కబీర్ సింగ్ చిత్రం వైద్యుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నది. అందుచేత సినిమాను నిషేధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్లర్లంటే తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా కబీర్ సింగ్ ఉంది అని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కేంద్ర వైద్యశాఖ మంత్రి, సమాచార శాఖా మంత్రికి లేఖ రాస్తామని మీడియాతో అన్నారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని సదరు వైద్యుడు కోరాడు.
డాక్లర్ల ఇమేజ్ డామేజ్
డాక్టర్ల ఇమేజ్ను తుంగలో తొక్కే విధంగా ఉంది. వైద్య వృత్తి పవిత్రమైంది. అలాంటి తెర మీద చెడు ప్రభావం చూపేలా ఉంది అంటూ ఫిర్యాదుదారు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి ఫిర్యాదు రావడం గమనార్హం. ఇటీవల వైద్యుడిపై ఓ కుటుంబం దాడి చేయడం దేశవ్యాప్తం నిరసనకు దారి తీసిన సంగతి తెలిసిందే.
రూ.100 కోట్ల క్లబ్లో
తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి ఆధారంగా హిందీలో కబీర్ సింగ్ను తెరకెక్కించారు. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రలో షాహీద్ కపూర్, శాలిని పాండే పాత్రలో కియారా అద్వానీ నటించారు. తెలుగులో అర్జున్ రెడ్డికి దర్వకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ హిందీ చిత్రానికి డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.