Don't Miss!
- News వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
- Technology 8GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా, 6.67 అంగుళాల డిస్ప్లేతో Realme స్మార్ట్ఫోన్ విడుదల..తొలిసారిగా ఈ ఫీచర్లతో!
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
కబీర్ సింగ్కు ఎదురుదెబ్బ.. మూవీని నిషేధించాలని ముంబైలో కేసు.. కేంద్రానికి లేఖ
Recommended Video
వివాదాలు, నిరసనలు, అభ్యంతరాల మధ్య కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. ఇప్పటికే క్రిటిక్స్ కొందరు పెదవి విరువగా, ఇటీవల సెన్సార్ బోర్డు సభ్యురాలు వీణా టిక్కూ ఘాటుగా విమర్శలు సంధించింది. ఇవేమీ పట్టించుకోకుండా ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. అయితే తాజాగా కబీర్ సింగ్ సినిమాపై వైద్యులు మండిపడ్డారు. సినిమాను నిషేధించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకు ఈ వివాదంలో విషయం ఏమిటంటే..
వైద్యవృత్తిని కించపరిచే విధంగా ఉందని
సక్సెస్ దిశగా దూసుకెళ్తున్న కబీర్ సింగ్పై ముంబైకి చెందిన ఓ డాక్టర్ కేసు నమోదు చేశారు. షాహీద్ కపూర్, కియారా అద్వానీ ప్రతివాదులుగా చేర్చారు. వైద్య వృత్తిని కించపరిచే విధంగా సినిమాను తెరకెక్కించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చిత్రంలో షాహీద్ కపూర్ మద్యానికి బానిసైన సర్జన్గా నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా డ్రగ్ ఎడిక్ట్గా కూడా కనిపిస్తాడు.
మనోభావాలను దెబ్బతీసే విధంగా
కబీర్ సింగ్ చిత్రం వైద్యుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నది. అందుచేత సినిమాను నిషేధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్లర్లంటే తప్పుడు అభిప్రాయం కలిగే విధంగా కబీర్ సింగ్ ఉంది అని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కేంద్ర వైద్యశాఖ మంత్రి, సమాచార శాఖా మంత్రికి లేఖ రాస్తామని మీడియాతో అన్నారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని సదరు వైద్యుడు కోరాడు.
డాక్లర్ల ఇమేజ్ డామేజ్
డాక్టర్ల ఇమేజ్ను తుంగలో తొక్కే విధంగా ఉంది. వైద్య వృత్తి పవిత్రమైంది. అలాంటి తెర మీద చెడు ప్రభావం చూపేలా ఉంది అంటూ ఫిర్యాదుదారు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి ఫిర్యాదు రావడం గమనార్హం. ఇటీవల వైద్యుడిపై ఓ కుటుంబం దాడి చేయడం దేశవ్యాప్తం నిరసనకు దారి తీసిన సంగతి తెలిసిందే.
రూ.100 కోట్ల క్లబ్లో
తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి ఆధారంగా హిందీలో కబీర్ సింగ్ను తెరకెక్కించారు. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రలో షాహీద్ కపూర్, శాలిని పాండే పాత్రలో కియారా అద్వానీ నటించారు. తెలుగులో అర్జున్ రెడ్డికి దర్వకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ హిందీ చిత్రానికి డైరెక్టర్గా వ్యవహరించాడు. ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.