twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాంపల్లి కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. చెల్లని చెక్కు కేసులో న్యాయమూర్తికి పూచికత్తు సమర్పించారు. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా పడింది.

    ‘నీజతగా నేనుండాలి' సినిమా విషయంలో బండ్ల గణేష్ తమను మోసం చేసాడని సినీ నటుడు సచిన్ జోషి‌కి సంబంధించిన వైకింగ్ మీడియా సంస్థ ఈ కేసు పెట్టింది.

    హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2' చిత్రాన్ని సచిన్ జోషి హీరోగా తెలుగులో ‘నీజతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేసారు. నజియా హీరోయిన్ గా నటించింది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు.

    Bandla Ganesh attend Nampally Court

    ఈ చిత్రానికి గణేష్ నిర్మాతగా ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టింది మాత్రం సచిన్ జోషికి చెందిన వైకింగ్ మీడియా సంస్థనే. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో గణేష్ మోసం చేసాడని, నష్టాలు వచ్చాయని తప్పుడు లెక్కలు చూపాడని ఆ సంస్థ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

    ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషికి చెందిన వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ కు చెందిన పరమేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మించాయి. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అప్పట్లో అంతటా వినిపించింది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరించాడని అప్పట్లో టాక్.

    English summary
    Bandla Ganesh attend Nampally Court in cheque bounce case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X