Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాంపల్లి కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్
హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. చెల్లని చెక్కు కేసులో న్యాయమూర్తికి పూచికత్తు సమర్పించారు. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా పడింది.
‘నీజతగా నేనుండాలి' సినిమా విషయంలో బండ్ల గణేష్ తమను మోసం చేసాడని సినీ నటుడు సచిన్ జోషికి సంబంధించిన వైకింగ్ మీడియా సంస్థ ఈ కేసు పెట్టింది.
హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఆషికి 2' చిత్రాన్ని సచిన్ జోషి హీరోగా తెలుగులో ‘నీజతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేసారు. నజియా హీరోయిన్ గా నటించింది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు.
ఈ చిత్రానికి గణేష్ నిర్మాతగా ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టింది మాత్రం సచిన్ జోషికి చెందిన వైకింగ్ మీడియా సంస్థనే. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో గణేష్ మోసం చేసాడని, నష్టాలు వచ్చాయని తప్పుడు లెక్కలు చూపాడని ఆ సంస్థ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషికి చెందిన వికింగ్ మీడియా, బండ్ల గణేష్ కు చెందిన పరమేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మించాయి. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అప్పట్లో అంతటా వినిపించింది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరించాడని అప్పట్లో టాక్.