Don't Miss!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Technology గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
- News బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
ముందు గొయ్యి వెనుక నుయ్యి.. సీఎం కేసీఆర్పై బండ్ల గణేష్ కామెంట్స్!
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై బండ్ల గణేష్ స్పందిస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దామా..
వెరైటీకి మారుపేరు.. బండ్ల గణేష్
కమెడియన్ బండ్ల గణేష్ వెరైటీకి మారుపేరు అని చెప్పుకోవచ్చు. అది సినిమా అయినా, రాజకీయంగా, వ్యాపారమైనా ఈయన మాట్లాడే తీరు అందరికీ భిన్నంగా ఉంటుంది. సందర్భం ఏదైనా.. విషయాన్ని ముక్కుసూటిగా చెబుతూ కబ్బుపుబ్బా నవ్వించడం బండ్ల గణేష్కి మాత్రమే చెల్లుతుంది. ఇదే బాటలో తాజాగా ఈ కమెడియన్ చేస్తున్న ట్వీట్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కరోనా ఎఫెక్ట్.. పౌల్ట్రీ పరిశ్రమ విలవిల
ప్రపంచాన్నే కుదిపేస్తున్న కరోనా వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను ప్రత్యక్షంగా కాటేసింది. కరోనా భయంతో జనమంతా చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ కొనేవారు లేక, తినేవారు కనిపించక పౌల్ట్రీ పరిశ్రమ విలవిలలాడిపోయింది. చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. కొన్నిచోట్ల కోళ్లను లారీలతో పూడ్చిపెట్టిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఎంటరైన కేసీఆర్.. ప్రెస్ మీట్లో చికెన్ ప్రస్తావన
ఈ నేపథ్యంలో వైద్యుల సలహా తీసుకున్న కేసీఆర్.. రీసెంట్గా జరిగిన ఓ ప్రెస్ మీట్లో చికెన్ తినడం ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. చికెన్, గుడ్లు పోషకాహారం అని, చికెన్ తినడం ద్వారా కరోనా వైరస్ సోకదని తెలిపారు. దీంతో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం కొన్నిచోట్ల చికెన్ రేట్ కిలోకి 250గా ఉంది.
|
దండాలయ్య.. కేసీఆర్ ఫోటో షేర్ చేస్తూ బండ్ల గణేష్
ఈ పరిస్థితులు చూసి స్వయానా పౌల్ట్రీ పరిశ్రమ నడిపిస్తున్న బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. మొదటగా ''దండాలయ్య నువ్వు వందేళ్లు చల్లగా ఉండాలి అయ్యా'' అంటూ సీఎం కేసీఆర్ ఫోటో షేర్ చేసిన ఆయన.. ఆ తర్వాత ''భగవంతుని ఆశీర్వాదంతో పుట్టిన మన రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి కేసీఆర్'' అని తెలుపుతూ మరో ట్వీట్ చేశారు.
|
పెట్టుబడి పెట్టాము.. భయంగా ఉంది
ఆ వెంటనే ''మీరు పెట్టే ప్రతి పత్రికా విలేకరుల సమావేశం తెలంగాణ ప్రజలకు భరోసా ధైర్యం నేనున్నాను అని నమ్మకం కలుగుతుంది'' అని పేర్కొన్న బండ్ల గణేష్.. తాజాగా తన పౌల్ట్రీ ఫామ్లో కోడిని ముద్దాడుతూ మరో ట్వీట్ చేశారు. ''మా పరిస్థితి ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి లా ఉంది కోట్లు పెట్టుబడి పెట్టాము భయంగా వుంది. దీయబ్బ కరోనా'' అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
Recommended Video
సరిలేరు నీకెవ్వరు..
ఇకపోతే గత ఎన్నికల్లో రాజకీయాలతో బిజీగా ఉన్న బండ్ల గణేష్.. ఇటీవలే మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించాడు. ఇకపై సినిమాల్లో నటిస్తానని, మంచి అవకాశం వస్తే సినిమాలు నిర్మిస్తానని కూడా ఆయన ఇటీవలే తెలిపారు.