కరోనా ఎఫెక్ట్.. 'భరిస్తాం సార్' అంటూ కేసీఆర్పై బండ్ల గణేష్ కామెంట్స్!
బండ్ల గణేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. గత ఎలక్షన్స్ లో బండ్ల గణేష్ ఏ విధంగా హడావుడి చేసాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు, ఇక సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పై వచ్చిన ట్రోల్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే కరోనా లాక్ డౌన్ పొడగింపుపై ఇటీవల కేసీఆర్ ఇచ్చిన పిలుపుకి బండ్ల గణేష్ పాజిటివ్ కామెంట్స్ చేశారు.

ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్..
కేంద్ర ప్రభుత్వం అనుమతితోతెలంగాణరాష్ట్రప్రభుత్వం కూడా ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్ ని అమలు చేసింది. సీఎంకేసీఆర్శనివారం జరిపిన మీడియా సమావేశంలో లాక్ డౌన్ పై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సినీప్రాముఖులుఎవరి స్టయిల్లోవారు ట్వీట్ చేస్తున్నారు. అదే తరహాలోబండ్ల గణేష్ కూడా కేసీఆర్పై ప్రశంసలుకురిపించారు.

సరిలేరు నీకెవ్వరు..
"మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు'' అంటూ..''నాలుగు రోజులు కాదు.. సార్ మీమీద నమ్మకంతో మీరు ఉన్నారు అన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్లకే పరిమితం అవుతూ విజయం సాధిస్తాం. జై కేసీఆర్'' అని పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రేమ కావాలి..
''మీరు చేసే కార్యక్రమాలు మీరు తీసుకునే నిర్ణయాలు అన్ని భగవంతునితో జయప్రదం కావాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా..ఈ కఠోరమైన సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కెసిఆర్ నాయకత్వంలో పని చేసి తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని అందర్నీ వేడుకుంటున్నా'' అని ట్వీట్చేశారు.
Recommended Video

జై కేసీఆర్..
''భారతదేశ చరిత్రలో ఇటువంటి సమయాల్లో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, ఎన్ని కష్టాలైనా భరిస్తాం ఎన్ని రోజులు అయినా ఎదురు చూస్తాం.మాకు మీరు ఉన్నారని భరోసా మీరు ఉన్నారనే ధైర్యం.. మీరు రక్షిస్తానేనమ్మకం.. జై కేసీఆర్'' అంటూ బండ్ల గణేష్చేసిన ట్వీట్స్వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











